స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ని మట్టికరిపించిన అశ్వత్థామ.. మెగా ఛీఫ్ గా గౌతమ్!
on Oct 19, 2024
బిగ్ బాస్ సీజన్ ఏడో వారం ముగింపుకి వచ్చేసింది. ఇక హౌస్ లో నిన్నటి దాకా సాగిన టాస్క్ ముగిసింది. మెగా ఛీఫ్ కోసం సాగిన టాస్క్ చివరి వరకు ఆసక్తికరంగా సాగింది.
బిగ్బాస్ హౌస్కి న్యూ మెగా చీఫ్గా గౌతమ్ అయ్యాడు. టాస్క్ ఏంటో చూసేద్దాం. బిగ్ బాస్ ఏం చెప్పాడంటే.. ఈ టాస్కులో గెలవాలంటే ప్లాజ్మాలో చూపించన బొమ్మలు ఏ తలగడ (దిండు)పై ఉందో వెతికి దాన్ని తీసుకొని ముందుగా బాక్స్లోకి వెళ్లాలి.
ఈ టాస్కులో సరైన కుషన్ను తీసుకెళ్లే సభ్యుడిని బాక్స్లోకి వెళ్లే ముందు వరకూ ఆపొచ్చు.. తప్పు కుషన్ తీసుకెళితే మళ్లీ వెళ్లి తీసుకురావచ్చంటూ రూల్స్ చెప్పాడు బిగ్బాస్. ప్రతి రౌండ్కి ఎంతమంది సభ్యులు ఆడాలో బిగ్బాస్ చెబుతాడు.. దాని ప్రకారం ఎవరు ఎక్కువ రౌండ్స్ విన్ అయితే వాళ్లు టాస్కు గెలిచినట్లు. ఇక ఈ టాస్కు ఇలా మొదలైందో లేదో వరుసగా రెండు రౌండ్స్ గెలిచింది ఓజీ క్లాన్. కానీ ఆ తర్వాత మిగిలిన అన్నీ రౌండ్స్ను రాయల్స్ క్లాన్ గెలిచింది.
ఇక ఈ టాస్కులో రాయల్ క్లాన్ విన్ అయినందున వారికి ఓ ప్రయోజనం ఇచ్చాడు బిగ్బాస్. రాయల్స్ గెలిచిన కారణంగా అడ్వాంటేజ్ పొందారు.. ఇప్పుడు ఓవర్ స్మార్ట్ ఛార్జర్స్ నుంచి ఇద్దరి సభ్యుల్ని తొలగించండి.. అంటూ బిగ్బాస్ చెప్పాడు. దీంతో రాయల్స్ అంతా డిస్కషన్ పెట్టుకున్నారు. గంగవ్వ అయితే నిఖిల్ గాడిని తీసేయాలి.. వాడు పెద్ద డేంజర్ గాడు వాడు, అలానే నబీల్ను కూడా తీసేయాలంటూ చెప్పింది. ఇక అందరూ డిసైడ్ అయి నిఖిల్-నబీల్ ఇద్దరినీ తీసేశారు. వాళ్లు ఆల్ రెడీ చీఫ్ అయ్యారు కనుక వేరే వాళ్లకి అవకాశం ఇద్దామనే ఉద్దేశంతోనే తీసేశామంటూ రీజన్ చెప్పారు. టాస్కు ముగిసే సమయానికి ఔట్ కాకుండా ఉన్న విష్ణుప్రియ, యష్మీ, మణికంఠ, ప్రేరణ, అవినాష్, గౌతమ్, నయని, హరితేజ, మెహబూబ్, గౌతమ్, రోహిణి, గంగవ్వ, టేస్టీ తేజ.. మీరందరూ మెగా చీఫ్ కంటెండర్స్గా ఎంపికయ్యారు.. అంటూ బిగ్బాస్ చెప్పాడు. ఇక గేమ్లో అప్పటికే ఔట్ అయిన పృథ్వీ, నబీల్, నిఖిల్.. మెగా చీఫ్ కంటెండర్ రేసు నుంచి తప్పుకున్నారన్నమాట. అలానే పృథ్వీ-తేజ పనిష్మెంట్ కూడా పూర్తయిందని బిగ్బాస్ చెప్పాడు. దీంతో వాళ్ల లగేజీ యాక్సెస్ తిరిగి ఇచ్చేశారు. ఇక 'పట్టుకో లేదా తప్పుకో' అనే టాస్క్ లో చివరి వరకు గౌతమ్, గంగవ్వ నిలిచారు. వారిలో గౌతమ్ మెగా ఛీఫ్ గా గెలిచాడు.
Also Read